https://www.clickmagick.com/share/1485142037427

Tag Archives: ధర్మసందేహాలు (Dharma Sandehalu)

సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర భక్తులు మిరియాలు, ఉప్పు ఎందుకు ఉంచుతారు?

మిరియాలు అంటే కారం. ఉప్పు, కారం మన నాలుకను ఆకర్షించే ప్రధానమైన రుచులు. యోగసాధనలో రుచులపై మమకారం వదులుకోవటం ఒక భాగం. సుబ్రహ్మణ్యుడు కుండలినీ స్వరూపుడు. అందుకు సంకేతంగానే సర్పాకారంలో దర్శనమిస్తూ ఉంటాడు. ఆ యోగమూర్తి సన్నిధిలో రుచులపై మోహం వదులుకుంటున్నామని, యోగమార్గంలోకి వస్తున్నామని తెలియచేయటానికి ఉప్పు, మిరియాలు ఉంచుతుంటారు.


ధ్వజస్తంభ పీఠాన్ని.. బలిపీఠంగా భావిస్తారు. పక్షుల కోసం అర్చకులు అక్కడ అన్నం ఉంచడం ఆలయ సంప్రదాయం. ఆ పీఠం దగ్గర ఉప్పుకారాలు వదలడం రుచులపై ఆసక్తిని వదిలిపెట్టడమన్నమాట.


మరో కోణంలో చూస్తే.. సుబ్రహ్మణ్యుడు బ్రహ్మచారి, జ్ఞానమూర్తి. ఉపనయన క్రతువులో నాందీముఖంలో బ్రహ్మచారికి ఉప్పుకారాలు లేని భోజనం వడ్డిస్తారు. విద్యపై అభిరుచి తప్ప మరే ఇతర రుచులపై బ్రహ్మచారి ఆసక్తి కలిగి ఉండరాదన్నది బ్రహ్మచర్య వ్రతంలో భాగం. స్వామి బ్రహ్మచర్య వ్రతదీక్షను గౌరవిస్తూ భక్తులు ఇలా ఉప్పు, మిరియాలు వదలడం ఆచారంగా వస్తోంది.


       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

వినాయకుడూ సుబ్రహ్మణ్యుడూ బ్రహ్మచారులా?

గణపతి ఉపాసన, కుమారస్వామి ఉపాసన విడివిడిగా చేసేటప్పుడు సిద్ధిబుద్ధి గణపతికి, వల్లీదేవసేనా కుమారస్వామికి ఉన్నట్లుగాను భావన చేస్తున్నాం. అమ్మవారి తనయులుగా వారిని భావించినప్పుడు శిశురూపంలోనే సాక్షాత్కరిస్తున్నారు.


గణపతి – సిద్ధిబుద్ధి, కుమారస్వామి – వల్లీదేవసేనలను భార్యాభర్తలుగా అన్వయించడానికి వీలులేదు. శక్తులకు సంకేతం. అందుకే దీనిని భ్రాంతిమాత్రదాంపత్యం అంటారు. దాంపత్యం వంటిదే తప్ప దాంపత్యం కాదు. ఇది ఉపాసనాపరమైన మర్మం.


గణపతికి సిద్ధిబుద్ధి భార్యలు, పుత్రులు క్షేముడు, లాభుడు. ఇవి సంకేతములు మాత్రమే. దేవతా విషయంలో స్త్రీలు అని చెప్పినప్పుడు శక్తులు అని అర్థం. గణపతి కార్యసిద్ధిని కలిగించే దేవత. అందుకే సిద్ధివినాయకుడు అంటాం. ఏ కార్యమైనా మనకి పరిపూర్ణఫలం ఇవ్వాలంటే రెండు లక్షణాలు ఉండాలి – కార్యానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి, చిట్టచివరికి ఆ కార్యం మనకి సిద్ధింపబడాలి. అందుకే కార్యానికి కావలసిన జ్ఞానము బుద్ధి, కార్యము యొక్క ఫలము సిద్ధి. ఈ రెండింటినీ శక్తులుగా కలిగినటువంటి కార్యసాధక శక్తి ఏదైతే ఉన్నదో ఆయన గణపతి. కార్యానికి అవసరమైన సాధన బుద్ధి, కార్యం యొక్క ఫలం సిద్ధి. ఈ రెండింటినీ ఇచ్చేవాడు విఘ్నసంహారకుడైన గణపతి. ఇవి లభిస్తే మనకు లభించేది క్షేమము, లాభము. క్షేమం పరమార్థానికి సంబంధించినది, లాభం భౌతికమైన ఇహజీవితానికి సంబంధించినది. ఈ రెండూ గణపతి వల్ల మనకు లభిస్తున్నాయి కాబట్టి పుత్రస్థానాలుగా చెప్పారు. అంతేకానీ భార్యలని, పుత్రులని భౌతికంగా, లౌకికంగా, దేవతారూపంగా కూడా భావించడం తగని విషయం. అయితే ఉపాసనాపరంగా వాటి బీజములు వాటికి ఉన్నాయి గనుక మంత్రబీజం అంటూ ఉంటే దేవతాకృతి అంటూ ఉంటుంది గనుక సిద్ధీబుద్ధీయుత గణపతిని ఉపాసించడం అనే మంత్రశాస్త్రవిషయం వేరు. అది పౌరాణిక కథలకు అన్వయించడానికి లేదు.


యోగపరంగా చెప్పుకుంటే యోగియైన సాధకుడికి ఋతంభరా అయినటువంటి ప్రజ్ఞ లభిస్తుంది. సృష్టికి ఆధారమైనటువంటి సత్యాలకి కూడా ఏవి ఆధారమైనవో ఆ సత్యాలను ఋతములు అంటారు. ఆ ఋతములు తెలుసుకోగలిగే ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో దానిని ఋతంభరా ప్రజ్ఞ అంటారు. యోగియైన సాధకుడికి ఋతంభరా ప్రజ్ఞ సమృద్ధిగా ఉంటుంది. ఆ ఋతంభరా ప్రజ్ఞాస్వరూపుడే గణపతి. అయితే ఈ ప్రజ్ఞాలాభం కలిగినప్పుడు బుద్ధి, సిద్ధి మనకి వశ్యం అవుతాయి. ఆ ప్రజ్ఞ కలుగకుండా అడ్డుకునేవి బుద్ధి, సిద్ధి. మన బుద్ధి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. బుద్ధి రకరకాలుగా ఆలోచనలు చేసి మేధాపరమైన భావనలు తెచ్చేటప్పటికీ బుద్ధికి కూడా అతీతమైనటువంటి ఋతంభరా ప్రజ్ఞను చేరుకోవడానికి బుద్ధియే ఆవరోధం అవుతోంది.


యోగంలో అణిమ, మహిమ మొదలైన రకరకాల సిద్ధులు వస్తూ ఉంటాయి. ఆ సిద్ధులు వచ్చినప్పుడు లోభపడిపోయి పడిపోతాం. ఋతంభరా ప్రజ్ఞకు వెళ్ళడానికి బుద్ధి, సిద్ధి కూడా అవరోధాలు అవుతూ ఉంటాయి. ఋతంభరా ప్రజ్ఞా స్వరూపుడైన గణపతిని ఆరాధన చేసినప్పుడు ఆయన బుద్ధి సిద్ధులను తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటాడు. బుద్ధి సిద్ధులు వశమై ఉంటాయి ఋతంభరా ప్రజ్ఞ కలిగిన వారికి. అందుకు బుద్ధిసిద్ధులు పత్నులుగా చెప్పబడుతున్నారు. వాటిని వశం చేసుకున్నవాడే సర్వ విఘ్నములనూ తొలగించుకున్నావాడై పరమార్థాన్ని పొందగలడు. అందుకే విఘ్నసంహారకుడు అని పేరు.


కుమారస్వామి, వల్లీ దేవసేన అని చెప్పినప్పుడు వల్లి అనగా లత అని అర్థం. కుండలినీ శక్తియే ఈ లత(వల్లి) అని చెప్పబడుతున్నది. విశ్వంలో ఉన్న ప్రకృతి శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవసేనలు. దివ్యశక్తులన్నింటినీ సమీకరించి నడిపించే ఈశ్వర చైతన్యమే దేవసేనాపతియైన సుబ్రహ్మణ్యుడు.


గణపతిని, కుమారస్వామిని నైష్టిక బ్రహ్మచారులు అంటారు. అందుకే గణపతి ఆరాధనలోను, సుబ్రహ్మణ్య ఆరాధనలోను బ్రహ్మచారి (వటువు) పూజ ప్రత్యేకించి చెప్పారు. ఈ వటుపూజయే తెలియజేస్తుంటుంది వాళ్ళు నిత్యబ్రహ్మచారులు అని.


       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

శ్రీ సుబ్రహ్మణ్య విభూతి మహిమ (Sringeri Jagadguru on the Shakti of Vibhuti Prasadam of Lord Karthikeya)

Sringeri Jagadguru explains the Shakti (power) of Vibhuti prasadam of Lord Muruga and the significance of Palani. Sri Adi Shankara Bhagavatpada has sung the praise of Lord Karthikeya in Subrahmanya Bhujanga Stotram. He says that whatever be the disease afflicting a person, it will subside by the mere application of the Vibhuti Prasada of the Lord. The same Prasada removes evil spirits too. However setting out to test the power of the Lord is futile. What is the power of the Lord and who are we to test Him? We stand to get nothing out of it. However, if we approach the Lord with devotion, our difficulties subside and it results in our welfare.

     ****** Message from Sringeri Jagadgurus: ******

video
play-sharp-fill

తిరుచెందూరు విభూతి మహిమ (బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనము నుంచి)…



Article: Miraculous Healing Power of Tiruchendur Vibhuti

Article: Tiruchendur Patra Bhuti: The Greatness of Tiruchendur Vibhuti Leaves

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

కుమారస్వామికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చింది?

ప్రశ్న: శివపార్వతీనందుడైన శ్రీ షణ్ముఖస్వామి, నాగేంద్రునిగా కొలిచే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకే రూపమా? కుమారస్వామికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చింది?

పూజ్య గురువులు ‘సమన్వయ సరస్వతి’ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి సమాధానం:



       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******